PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్క పరుగుతో గెలిచిన జింబాంబ్వే !

1 min read

పల్లెవెలుగువెబ్ : టీ20 వరల్డ్ కప్ లో వరుస సంచనాలు చోటుచేసుకుంటున్నాయి. ఏమాత్రం గెలుపు అంచనాలు లేని కొత్త జట్లు కూడా ఈ మెగా టోర్నీలో బలమైన జట్లను మట్టి కరిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే వెస్టిండీస్ సిరీస్ నుంచి అవుట్ కాగా… అదే ప్రమాదం మరికొన్ని కీలక జట్లకు పొంచే ఉంది. గురువారం రాత్రి ముగిసిన లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. అంతగా పటిష్ట లైనప్ లేని జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. అది కూడా ఒకే ఒక్క పరుగు తేడాతో పాక్ ఓడిపోవడం గమనార్హం. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన జింబాబ్వే జట్టు మరో సంచలనాన్ని నమోదు చేసింది.

About Author