PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నాయకుల అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం

1 min read

18వ డివిజన్ కు చెందిన మహిళలు కన్నీటి పర్వంతో ఆవేదన

కొద్ది రోజులు ఓపిక పట్టలని ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి భరోసా

టిడిపికి ప్రభుత్వాన్ని గెలిపించండి,జగన్ ప్రభుత్వాన్ని సాగనంపండి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కావాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అయితేనే సాధ్యపడుతుందని ఏలూరు కూటమి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి అన్నారు. బుధవారం బడేటి క్యాంప్ కార్యాలయానికి 18వ డివిజన చెందిన మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వారి వారి సమస్యలను చంటికి వివరించారు. వైసిపి ప్రభుత్వం నాయకులు తమ డివిజన్లో అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని కన్నీటి పర్వంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి టిడిపి అధినాయకుడు చంద్రబాబు నాయుడుని, టిడిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావలసిన అవసరం మీపై ఎంతైనా ఉందన్నారు. జూన్ నెలలో ఫలితాలు వస్తాయని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వచ్చిన వెంటనే మీరందరి సమస్యలు తీర్తే బాధ్యత నాదని. మీరు కొద్ది రోజులు ఓపిక పట్టాలoటూ వారికి భరోసా కల్పించారు. టిడిపి ప్రభుత్వాన్ని గెలిపించండి, జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపండి అని. ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ టిడిపి సైకిల్ గుర్తుపై ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన పుట్టా మహేష్ కుమార్ కు రెండు ఓట్లు వేసి విజయం అందించాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టిడిపి సీనియర్ నాయకులు జుంజు మోజెస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *