PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోట్ల ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన టిడిపి శ్రేణులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: 13వ తారీకు జరగబోయే ఎన్నికల కోసం ప్రచారాలు రోజురోజుకీ వేడెక్కిపోతున్నాయి .ఈ సందర్భంగా ప్యాపిలి మండల పరిధిలోని ఉటకొండ హుసేనాపురం మండల కేంద్రమైన ప్యాపీలిలో బుధవారం డోన్ నియోజకవర్గం ఉమ్మడి తెదేపా, భాజపా, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తూ , అందులో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. కోట్ల కె.యి కుటుంబాలు మాట చెప్పిందంటే మరవకుండా అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకు వెళ్తున్నామని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. అలాగే డోన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థికి నాకు ఒక ఓటు ,ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి ఒక ఓటు వేసి ఆఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, కోట్ల శ్రీనాథ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణ మూర్తి, లక్ష్మీనారాయణ యాదవ్, గడ్డం అంకిరెడ్డి, సీమ సుధాకర్ రెడ్డి, గొల్ల రామ్మోహన్, నాగేంద్ర, ఖాజా పీర్ ,గండికోట రామసుబ్బయ్య, కిట్టు, చల్లా వీర, అనుదీప్, కడితం ప్రతాపరెడ్డి, ఎస్కేవలి, సుంకన్న, రాజా రవి,కొంగనపల్లి మధు, ప్రిన్సిపాల్ మధు, జనసేన నాయకుడు బ్రహ్మం, బిజెపి మండల కన్వీనర్ దామోదర్ నాయుడు సుదర్శన్, మధు శేఖర్ తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *