PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్యాపిలి మండలంలో మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: డోన్ నియోజకవర్గంలోని తండాల ప్రజలకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వెల్లడించారు. ప్యాపిలీ మండలంలోని సీతమ్మతండా, బుగ్గానిపల్లె తండా, అలేబాద్ తండాల ప్రజల ప్రేమాభిమానం మాటల్లో చెప్పలేనిదన్నారు. బుధవారం ప్యాపిలి మండలంలోని బూరుగుల, వంకమిట్టపల్లె,ఎరుకలవాడ, కౌలుపల్లె, సీతమ్మతండా ప్రాంతాల్లో మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బూరుగుల, సీతమ్మతండా గ్రామాల్లో మంత్రి ప్రచారానికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఈసందర్భంగా బుగ్గన మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టో ఆకాశంలో చుక్కలు తెచ్చిస్తామన్నట్లు ఉందని, చంద్రబాబు హామీలకు బీజేపీ దూరంగా జరిగిందని గుర్తు చేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యాదీవెన, పింఛన్ల పెంపు పథకాలు చెప్పింది చేసిన సీఎం వైఎస్ జగన్. రూ.3,500 పింఛన్ పెంపు, అమ్మఒడి రూ.17వేలు, చేయూత రూ.1.20 లక్షలకు పెంపు, రైతులకు రూ.80వేల ఆర్థిక సాయం వైకాపా ప్రభుత్వ హామీలని గుర్తు చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో కరపత్రాలు ఉగ్గాని, బజ్జీ కట్టుకోవడానికే పనికి వస్తాయని ఎద్దేవా చేశారు. 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు యువత భవిష్యత్తుకుఉ ఏ విధంగా భరోసా ఇస్తారని ప్రశ్నించారు. డోన్ లో అభివృద్ధి లేదని డోన్ టీడీపీ అభ్యర్థి చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారుని, దోరపల్లెలో ప్రమాదాలను నివారించే బ్రిడ్జిలను కట్టామని, చికిత్స కోసం కర్నూలుకు వెళ్లకుండా వంద పడకల ఆస్పత్రిని కట్టామని, తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని తెలిపారు. లద్దగిరికి రోడ్డేసుకుని అభివృద్ధి గురించి మాట్లాడాలని తెలిపారు. గత ఐదేళ్లూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పల్లెలన్నీ ప్రశాంతంగా ఉన్నాయని, మంచి చేసిన వారినే ఎన్నుకోవాలని కోరారు. మే 13న జరిగే పోలింగ్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తమను, ఎమ్పీగా పోచా బ్రహ్మనంద రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సీతమ్మ తండా సర్పంచ్ రామలక్ష్మి, లచ్చి రామ్ నాయక్, సోనీ నాయక్, సేవ్ నాయక్ , రాజా నాయక్, రామచంద్రనాయక్, చక్రనాయక్, కౌలుపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ,పెద్ద పుల్లారెడ్డి, సుబ్బారెడ్డి, కంబగిరి స్వామి, శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ, పురుషోత్తం రెడ్డి, పెద్ద రాముడు,  శ్రీరాముల రెడ్డి, పెద్దరాజు, శివ, ప్రభాకర్, బూరుగల సర్పంచ్ భువనేశ్వరీ, సిపి నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి ,తులసి రెడ్డి, బి శివారెడ్డి, నాగిరెడ్డి, వీ.సాలన్న తదితరులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. , కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు. రామన పైని కలో నను ఆశీర్వదించండి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *