PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైనార్టీ నాయకులు దౌలత్ భాష ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్​ నందికొట్కూరు (మిడుతూరు): నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్,ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి గెలుపు కోసం పట్టణంలోని 29వ వార్డులో మైనార్టీ వైసీపీ నాయకులు దౌలత్  భాష మహిళలు యువకులతో కలిసి బుధవారం సాయంత్రంఎన్నికల ప్రచారం చేపట్టారు.ముఖ్యమంత్రి జగనన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందని మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్ని వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి దరికి చేరుస్తూ ఉన్నారని నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సారథ్యంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ మరియు ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డికి మీ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని  ఈనెల 13న జరిగే ఎన్నికల్లో మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను  కోరారు.ఈ కార్యక్రమంలో ఇమ్రాన్,మౌలాలి,సమీర్,మహబూబ్,మద్దిలేటి, షరీఫ్, మా భాష,మాలిక్,చాంద్ బాష  మహిళలు సాబేర,మున్ని,హసీనా,ఆయేషా తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *